బంగారు తెలంగాణ(TS) అని బీఆర్ ఎస్ ప్రభుత్వం ఊదరగొడుతోంది.మరోవైపు అనారోగ్యం పాలయిన వారిని తరలించేందుకు అంబులెన్సులే కరువవుతున్నాయి.రాష్ట్రంలో రెండు గిరిజన హాస్టళ్లలో విషాహారం తిని అస్వస్థతకుగురైన పిల్లలను ఆస్పత్రికి తరలించే దిక్కు లేకుండా పోయింది.సమయానికి అందుబాటులో అంబులెన్సులు లేక ఆ పిల్లలని లారీలు ఎక్కించి ఆస్పత్రికి తరలించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
నిజామాబాద్ జిల్లా భీంగల్ కస్తూర్భా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో 90 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇది జరిగిన రెండు రోజులకి మరోకటి నాగర్ కర్నూల్ జిల్లా అమ్రబాద్ మండలం మన్ననూర్ గిరిజన హాస్టల్ లో విద్యార్ధులు కూడా అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ వల్ల 40 మందికిపైగా విద్యార్థులకు అస్వస్థతపాలయ్యారు.
కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అనారోగ్యం పాలవడం దీనిపై వివిధ మీడియాల్లో కథనాలు రావడంతో అలర్ట్ అయిన నిర్వాహకులు బాలికల ఆరోగ్య పరిస్థితిని గమనించి వారిని వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నాగర్కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 9 మంది, అచ్చంపేట ఆసుపత్రిలో 50 మంది వరకు విద్యార్థినులు చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న నలుగురి విద్యార్థినులకు నాగర్కర్నూల్ ఆసుపత్రిలో చికిత్స ఇస్తున్నారు.
ఘటనపై విద్యార్ధి సంఘాల నిరసన (TS)
బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు శ్రీశైలం రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. ఘటనపై ఆరా తీసిన మంత్రి సత్యవతి రాథోడ్ బాలికలకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మన్ననూరు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో రాత్రి భోజనం చేశాక 40 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. 10 మంది విద్యార్థినులు కడుపు నొప్పి, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడారు.
బాలికల ఆరోగ్య పరిస్థితిని గమనించిన పాఠశాల సిబ్బంది వారిని వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు శ్రీశైలం రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. ఘటనపైఆరా తీసిన మంత్రి సత్యవతి రాథోడ్ బాలికలకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
నాసిరకం సరుకుతో వంట
హాస్టల్ నిర్వహకులు విద్యార్థునులకు నాణ్యమైన భోజనం పెట్టడంలో విఫలమయ్యారని ఆరోపించారు. డబ్బులకి కక్కుర్తిపడి నాసిరకమైన భోజనం పెట్టడం వల్ల విద్యార్థినుల ప్రాణాలపైకి వచ్చిందన్నారు.హాస్టల్లోని యువతుల ఫుడ్ కోసం ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేసినా హాస్టల్ సిబ్బంది మాత్రం డబ్బులను పక్కదోవ పట్టిస్తూ కుళ్లిపోయిన టమాటాలు, గుడ్లతో పాటు ఇతర నాసిరకం సరకులను తీసుకొచ్చి విద్యార్థులకు పెడుతున్నారు.దీంతో ఆ భోజనం తిన్న విద్యార్ధినులు అస్వస్థతకు గరువుతున్నారని వెల్లడించారు.
మరోవైపు అస్వస్థతకు గురైన విద్యార్థునుల తల్లిదండ్రులకు హాస్టల్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. దీంతో హుటా హుటీన అచ్చంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న యువతుల పేరెంట్స్ విద్యార్థునుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచన మేరకు కొందరు విద్యార్థునులను మహబూబ్ నగర్లోని ప్రైవేట్ ఆస్సత్రికి తరలించారు.బాధితుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు హాస్టల్ సిబ్బందిపై కేసు నమోదు చేసుకున్నారు. హాస్టల్ సిబ్బంది సరుకులను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారనే దానిపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలతో పండగ చేస్తున్నామని ఊదరగొట్టే తెలంగాణ ప్రభుత్వం విద్యార్ధులకు కనీస అత్యవసర వైద్య సేవలు అందించడంలో విఫలమైందని ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నాయి.