తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాక సందర్భంగా పుంగనూరులో టెన్షన్ నెలకొంది. ప్రాజెక్టుల సందర్శన కోసం నేడు చంద్రబాబు చిత్తూరు జిల్లా పుంగనూరులో పర్యటించాల్సి ఉంది. ఆయన అక్కడ రోడ్ షోలో పాల్గొని ప్రసంగించాల్సి ఉంది. దీంతో పుంగనూరులో చంద్రబాబును అడుగుపెట్టనివ్వబోమంటూ వైసీపీ కార్యకర్తలు పెద్దయెత్తున ర్యాలీ నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఒక్క ప్రాజెక్టు కూడా చంద్రబాబు హయాంలో ప్రారంభం కాలేదని, చిత్తూరు జిల్లాకు అన్యాయం చేసిన చంద్రబాబును అడుగుపెట్టనివ్వబోమని వారంటున్నారు.
చంద్రబాబు పర్యటనను…
మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తమ పార్టీ అధినేత పర్యటనను ఎలా అడ్డుకుంటారో చూస్తామని టీడీపీ నేతలు కూడా సవాల్ విసురుతున్నారు. దీంతో పుంగనూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. పుంగనూరుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో చంద్రబాబు టూర్ ఉద్రిక్తతగా మారింది. దాదాపు ఐదు వందల మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.