అరటిపండు(Banana) చాలా శక్తివంతమైన పండు. దీని వాడకం వల్ల శరీరానికి జీవశక్తి లభిస్తుంది. ఆకలిగా ఉన్నప్పుడు ఒక్క అరటిపండు తింటే ఎక్కువ సేపు ఆకలి వెయ్యకుండా కడుపు నిండినట్టు గా అనిపిస్తుంది. ఈ పండు మిగత వాటిలా కాకుండా మెత్తగా ఉండటం వలన ఈ పండును చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ ఎంతో ఇష్టం గా తింటారు పైగా ఇదే సులభంగా జీర్ణం కూడా అవుతుంది. ఎక్కువ సమయం పాటు ఆకలిని నియంత్రిస్తుంది కూడా. మన పెద్ద వారు అయితే భోజనం అయ్యిన తరువుత కచ్చితంగా ఒక అరటిపండు తినేవారు.
కండరాలకు బలం మరియు పోషకాలను కూడా అందిస్తుంది. వ్యాయామం తర్వాత అరటిపండ్లు తినడం ఫిట్నెస్ ఔత్సాహికులకు తప్పనిసరి అని వ్యాయమ నిపుణులు చెబుతుంటారు. పండిన అరటిపండ్లు (Banana) ఇతర పండ్ల తో పోల్చితే వీటి ధర తక్కువనే చెప్పవచ్చు. కాబట్టి అందరూ కొనుక్కుని హాయిగా తింటారు. కానీ అరటిపండ్లు అందరికీ మంచిది కాదట. ఆయుర్వేదంలో, అరటిపండ్లను కొంతమందికి ప్రమాదకరమైనదిగా భావిస్తారు. అరటిపండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఎవరు తినకూడదో తెలుసుకుందామా…
అరటి పండు లో పోషకాలు…
అరటిపండు (Banana) తినడం వల్ల విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, మాంగనీస్, విటమిన్ బి6తో పాటు గ్లూటాతియోన్, ఫినాలిక్స్, డెల్ఫిడినిన్, రుటిన్, నారింగిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయట. ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ అరటి పండు తినడం పైన పేర్కొన్న పోషకాలు అన్ని శరీరానికి ఎంతో మేలు చేస్తాయట.
80 రకాల వ్యాధులకు ఔషధం…
అరటిపండు (Banana) 80 రకాల వ్యాధులను నయం చేస్తుందట. రోజు మనం చూసే అరటి పండుకు ఇంత శక్తీ ఉందా అని ఆశ్చర్యం కలిగిస్తోంది కదా..! కానీ ఇది పోషకాహార నిపుణులు స్వయంగా అంటున్నారు. అరటిపండు వాత-పిత్త దోషాన్ని సమతుల్యం చేస్తుందట. ఆయుర్వేదం ప్రకారం వాత తీవ్రత వల్ల దాదాపు 80 రకాల వ్యాధులు వస్తాయి. పొడిబారడం, ముడతలు పడడం, ఎముకలు పగిలిపోవడం, మలబద్ధకం, చేదు రుచి మొదలైన అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటిని అరటిపండు పరిష్కరించగలదు.
అరటిపండునుఎవరు తినవచ్చంటే..
ఆయుర్వేదం ప్రకారం అరటిపండు చల్లని గుణం కలిగి ఉంటుంది. ఇది జీర్ణం కావడానికి బరువుగా ఉంటుంది. ఇది లూబ్రికేషన్గా పనిచేస్తుంది. చర్మం పొడిబారినట్టు గా కానీ , ఎప్పుడూ అలసిపోయినట్టు, బాగా నిద్రపోనట్టు, శరీరంలో ఎప్పుడూ మంటగా ఉన్నట్టు అనిపించేవారు, ఎప్పుడు నీరు దాహం వేసే వారు రు, ఎక్కువ కోపంగా ఉన్నవారు అరటిపండును తినాలట. దీనివల్ల ఆ కోపస్వభావం, అతిదాహం వంటి సమస్యలని అరికడుతుందట.
అరటి పండు ను ఎవరు తినకూడదంటే..
అరటిపండు (Banana) కఫ దోషాన్ని పెంచుతుంది. కాబట్టి అధిక కఫ శరీర తత్వం ఉన్నవారు దీనిని తినకపోవడమే మంచిదంటున్నారు. ఈ పెరిగిన కఫం కారణంగా జీర్ణాశయంలో అగ్నితత్వం బలహీనంగా ఉంటే అరటి పండు దానిని మరింత నెమ్మదిస్తుంది. అధిక కొవ్వు, దగ్గు, జలుబు ఉన్నవారు, ఆస్తమా రోగులు దీనిని తినకూడదు. ఒకవేళ తినాలని అనిపిస్తే చాలా ఆలోచించి దీని పర్యావసానాలు ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉంటేనే తినాలి.