తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు మూడు రోజులు మాత్రమే జరగనున్నాయి. బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బీఏసీ సమావేశం ముగిసింది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వయిజరీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు.
రేపు వరదలపై…
రేపు జరగనున్న అసెంబ్లీలో వరదలు – జరిగిన నష్టంపై చర్చ జరపాలని నిర్ణయించారు. శనివారం మాత్రం బిల్లులపై చర్చించాలని బీఏసీ సమావేశంలో డిసైడ్ అయ్యారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాత్రం పది రోజుల పనిదినాలు అసెంబ్లీ నిర్వహించాలని కోరినా, మూడు రోజులు మాత్రమే నిర్వహించాలని మాత్రం బీఏసీలో నిర్ణయించారు. ఈ బీఏసీ సమావేశానికి బీజేపీికి ఆహ్వానం అందలేదు. ఈరోజు జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సాయన్న మృతికి సంతాపం తెలిపిన తర్వాత సభ రేపటికి వాయిదా పడింది.