బంగారం ధరలు ఎప్పుడూ అంతే. కొంత తగ్గినట్లు ఊరిస్తాయి. ఒక్కసారిగా పెరుగుతాయి. పెరుగుతున్న బంగారం ధరలకు కళ్లెం వేసే పరిస్థితి లేదు. డిమాండ్ కు అనుగుణంగా బంగారం దిగుమతులు లేవు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా – ఉక్రెయిన్ యుద్ధం, భారత్ ప్రభుత్వం బంగారం దిగుమతులను తగ్గించడం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతుంటాయి. తగ్గుతుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
అరవై వేలుకు…
ఈ ఏడాది తులం బంగారం అరవై వేలకు చేరుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే ఎగబడి మహిళలు సీజన్ తో సంబంధం లేకుండా కొనుగోలు చేయడం మొదలు పెట్టారు. ఈ ఏడాది గతంలో కంటే కొనుగోళ్లు అధికంగా ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. పసిడికి ఉండే డిమాండ్ ను బట్టి దిగుమతులు లేకపోవడం కారణంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు అందకుండా పోతున్నాయి. సామాన్యులకు ధరలు అందుబాటులో లేకుండా ఉంటున్నాయి. అయినా సరే కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు.
వెండి భారీగా…
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.350లు పెరిగింది. వెండి కూడా భారీగానే పెరిగింది. కిలో వెండి ధరపై రెండు వేల రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి, ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,000 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై వేలుగా నమోదయింది. ఇక కిలో వెండి ధర 75,600 రూపాయల వద్ద కొనసాగుతుంది.