సామన్యులకి టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాదులో కిలో టమాటా ధర రూ. 80నుంచి రూ. 100 పలుకుతుంది… టమాటా సాగు తగ్గడంతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు భారీగా తగ్గాయి. అంతేకాకుండా భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడంతో మార్కెట్లో ధరలు మండుతున్నాయి. నిజానికి హోల్సేల్ మార్కెట్లకు నిత్యం 9వేల బాక్సుల్లో 2.25 లక్షల కేజీల టమాటా వచ్చేది. అప్పుడు ధర రూ.15లోపే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు.. కేవలం 3 వేల టమాటా బాక్సులు మాత్రమే వస్తున్నాయి. ఇంకా ధరలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.. మళ్ళీ కొత్త పంట వచ్చేవరకు ఇలాగే ధరలు ఉండొచ్చనని అంటున్నారు.
తగ్గేదేలేదు అంటున్న చికెన్..
అటు చికెన్ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు.. కిలో చికెన్ రూ. 310 నుంచి రూ. 320 వరకు పలుకుతుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలతో పాటుగా నిత్యావసరధరలు కూడా పెరగడం, ఇప్పుడు అందులోకి టమాటో కూడా చేరడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారుదేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆల్ టైం హైకి చేరాయి. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలూ పోటీపడుతున్నాయి. ఉత్తరాదిలో మార్కెట్లో మరింత ప్రియంగా ఉన్నాయి. అత్యధికంగా ఉత్తరాఖండ్లో కిలో టమాటా రూ.250కు చేరింది. ఉత్తరకాశీ జిల్లా గంగోత్రి ధామ్లో కిలో రూ.250లకు అమ్ముతున్నారు.
అదే జిల్లాలోని మరికొన్ని చోట్ల కిలో 180 నుంచి రూ.200 వరకూ ఉంది. ఈ ప్రాంతంలో టమాటా ధర ఒక్కసారిగా పెరిగిపోయిందని కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల దెబ్బకు కూరగాయలు ధరలు కొండెక్కి కూర్చున్నాయి. దిగిరావట్లేదు. వేలాది హెక్టార్లలో పంట ధ్వంసం కావడం వల్ల.. మార్కెట్లో నెలకొన్న రోజువారీ డిమాండ్కు అనుగుణంగా కూరగాయలు సరఫరా కావట్లేదు. డిమాండ్ అండ్ సప్లై చెయిన్ అనేది ఇక్కడ దెబ్బతింది. ఫలితంగా- వాటి రేట్లు మహా భయానకంగా పెరిగాయి..పెరుగుతున్నాయి.కూరగాయల్లో తప్పనిసరిగా వినియోగించాల్సిన టొమాటో ధర కిలో ఒక్కింటికి వంద రూపాయలను ఎప్పుడో దాటేసింది. 150 రూపాయలకు చేరువ అవుతోంది.
ఉల్లిని మించి..
ఉల్లిని మించి.. సాధారణంగా వర్షాకాలంలో ఉల్లిపాయల రేట్లు కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తుంటాయి. ఆకాశాన్నంటుతుంటాయి. గత సీజన్లో పలువురు రైతులను లక్షాధికారులను చేసిన ఉల్లిపంట. కొన్ని రోజుల పాటు కిలో ఒక్కింటికి 100 రూపాయలకు పైగా స్థిరంగా కొనసాగింది వాటి రేట్లు. ఇప్పుడు ఈ డ్యూటీని టొమాటో తీసుకుంది. కిలో టొమాటో రేటు రికార్డు స్థాయికి చేరుకుంది. కొన్ని రకాల కూరగాయలదీ ఇదే పరిస్థితి. ఏపీ, తెలంగాణల్లోనే కాదు.. దాదాపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూరగాయల రేట్లు షాకిస్తున్నాయి.
గురువారం ఉత్తర్ ప్రదేశ్లోని షాజహాన్పుర్లో అత్యధికంగా కేజీకి రూ.162 పలికింది. దేశవ్యాప్తంగా సగటు ధర రూ.95.58గా ఉంది. కోల్కతాలో రూ.152, ఢిల్లీలో రూ.120, చెన్నైలో రూ.117, ముంబయిలో రూ.108 పలికింది. రాజస్థాన్లోని చురులో అత్యల్పంగా కేజీ టమాటా ధర రూ.31గా ఉంది.ధరలు ఒక్కసారిగా పెరగడంతో టమాటాలు కొనాలంటే జనం జంకుతున్నారు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు స్వయంగా రాయితీతో టమాటాలను తక్కువ ధరకు అందజేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కిలో రూ.50 చొప్పున ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి విక్రయిస్తోంది. అటు, తమిళనాడులోని స్టాలిన్ సర్కారు కూడా రూ.60లకు కిలో టమాటాలను అందజేస్తోంది. ఇక, కర్ణాటక రాజధాని బెంగళూరులో కిలో రూ. 101 నుంచి 121 వరకు టమాటా ధర ఉంది.మార్కెట్లో అడుగు పెడితే కిలో చొప్పున 40 రూపాయలకు దిగువన ఉండే కూరగాయలేవీ కనిపించట్లేదు. బెంచ్ మార్క్ పెట్టుకున్నట్లు కనిపిస్తోన్నాయవి. సాధారణ రోజుల్లో కిలో ఒక్కింటికి 20 రూపాయల లోపు ఉండే చాలా రకాల కూరగాయలు ఇప్పుడు డబుల్ అయ్యాయి. రెట్టింపు ధర పలుకుతున్నాయి. దీనితో సామాన్య ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వాటి రేట్లు చికెన్ ప్రైస్తో పోటీ పడుతున్నాయి. సంచి నిండా కూరగాయలను కొనలేని పరిస్థితి ఏర్పడిందనేది కొనుగోలుదారుల ఆవేదన.
Follow Us On : YouTube , Google News