టమాటా బంగారం అయిపోయింది. కిలో టమాటా 120 రూపాయలకు పైగానే ధర పలుకుతుంది. దిగుబడి తగ్గడంతో టామాటా ధరలు అమాంతంగా పెరిగాయి. దీంతో టమాటా మీద దొంగల కన్ను కూడా పడింది. కర్ణాటక రాష్ట్రంలో టమాటా దొంగతనం జరిగిన తీరు చూస్తుంటే అదే అనిపిస్తుంది. కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో టమాటాను దొంగలెత్తుకెళ్లారు. ఒక రైతు తాను పండించిన టమాటాను మార్కెట్ కు తీసుకెళ్లాలని భావించి 90 బాక్సులను తన ఇంట్లో ఉంచారు. మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకుందామని ఆ రైతు భావించారు.
తెలంగాణలోనూ…
కానీ రాత్రికి దొంగలు పడి 90 టమాటా బాక్సులను ఎత్తుకెళ్లారు. దీంతో రైతు లబో దిబో మంటున్నారు. టమాటా ధర పెరగడంతోనే దొంగల కన్ను దీనిపై పడింది. అలాగే తెలంగాణలోనూ టమాటా దొంగతనం జరిగింది. మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ మార్కెట్ లో ఉంచిన టమాటాను దొంగలు ఎత్తుకెళ్లారు. అయిదే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. టమాటాతో పాటు పచ్చిమిర్చి ధర కూడా పెరగడంతో వాటిని కూడా దొంగలు ఎత్తుకెళుతున్నారు. విచిత్రంగా ఉంది కదూ.. టమాటా లేనిదే ముద్ద దిగని పరిస్థితుల్లో .. ఆ బలహీనతను గమనించి దొంగలు హల్ చల్ చేస్తున్నారు.