హైదరాబాద్ నగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు. మొహరం ఊరేగింపు సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలను విధించినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో ఈ ఆంక్షలు కొనసాగనున్నట్లు అీధికారులు తెలిపారు. ఇప్పటికే భారీ వర్షాలతో రోడ్లపైకి నీరు చేరి ఇబ్బంది పడుతున్న వాహనదారులకు రేపు ట్రాఫిక్ పోలీసులు మరో షాక్ ఇచ్చారు.
మొహర్రం సందర్భంగా…
రేపు మధ్యాహ్నం 12 గంటల సమయం నుంచి రాత్రి పది గంటల వరకూ మొహర్రం ఊరేగింపు జరగనుంది. ఈ సందర్భంగా బీబీకా ఆలం రోడ్డు డబీరాపురా నుంచి చాదర్ఘాట్ వరకూ ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. చార్మినార్, గుల్జార్ హౌస్, బీబీకా ఆలం రోడ్డు, షేక్ ఫైజ్ కమాన్, యాకుత్పురా రోడ్డు, మీర్ ఆలం, పురానీ హవేలీ, దారులిఫా, ఎతేబాజ్ చౌక్, ఇమ్లిబిన్ లు మీదుగా దారి మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు. లక్షల మంది ఊరేగింపులో పాల్గొననున్నందున వాహనదారులు పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు.