ఒడిశా ట్రాజెడీ మరవకముందే బీహార్ (Bihar) లో మరో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఓ రైలులోని 21 బోగీలు పట్టాలు తప్పాయి. బక్సర్ జిల్లాలోని రఘునాథ్పూర్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 70 మందికి పైగా గాయపడినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఢిల్లీ నుంచి వస్తున్న 12506 ఆనంద్ విహార్ కామాఖ్య నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ రైలు బక్సర్ జిల్లా సమీపంలో పట్టాలు తప్పాయి.
ప్రమాద వార్త తెలియగానే ఈస్ట్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ ఆనంద్ విహార్ టెర్మినల్ నుంచి కామాఖ్య వరకు నడుస్తున్న రైలు బుధవారం రాత్రి 9.30 గంటలకు దానాపూర్ డివిజన్లోని రఘునాథ్పూర్ స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పాయని తెలిపారు. ప్రమాద వార్త తెలియగానే వైద్యబృందం, అధికారులతో ప్రమాద స్థాలనికి వాహనలను ఘటనా స్థలానికి పపించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు అన్ని ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం రైల్వే హెల్ప్లైన్ నంబర్లను విడుదల చేసారు.
మూడు బోగీలు పల్టీలు కొట్టాయి…… Bihar
దాదాపుగా అన్ని బోగీలు పట్టాలు తప్పాయని, మూడు బోగీలు పల్టీలు కొట్టాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. మరో 70 మంది గాయాలపాలయ్యారని వారిలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. రైలు ప్రమాదం జరగడంతో రైల్వేశాఖ హెల్ప్లైన్ను ఏర్పాటు చేసింది. పాట్నా: 9771449971, ధన్పూర్ 8905697493, కమాండ్ కంట్రోల్ 7759070004, ఆరా 8306182542 హెల్ప్లైన్ నంబర్లను అందుబాటులో ఉంచింది.
సెకన్లలోపే బోగీల్లో నుంచి వచ్చిన హాహాకారాలు…..
70 నుంచి 80 కిలోమీటర్ల వేగం ఆనంద్ విహార్ నుంచి కామాఖ్య వెళ్తోన్న నార్త్ ఈస్ట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అప్పుడే బక్సర్ జిల్లా రఘునాథ్పూర్ స్టేషన్కు చేరుకుంది. రాత్రి 9 గంటల 30 నిమిషాల తర్వాత ఉన్నట్టుండి భారీ శబ్దాలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేశాయి. అది విన్న సెకన్లలోపే బోగీల్లో నుంచి వచ్చిన హాహాకారాలు వారిని షాక్కు గురిచేశాయి. ఏం జరిగిందని చూస్తే.. పట్టాలు తప్పిన కొన్ని బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి.
ఈ ఘటన జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బోగీల్లో నుంచి ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు కూడా వెంటనే స్పాట్కు చేరుకున్నారు. స్థానికులతో పాటు సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని హాస్పిటల్స్కు తరలించారు. తీవ్ర గాయాలపాలైన వారిని పాట్నాలోని ఎయిమ్స్కు తరలించారు.
డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ దిగ్భ్రాంతి….
ఈ ఘటనపై బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కేంద్ర సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే కూడా ప్రమాదంపై స్పందించారు. ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బందిని ఘటనా స్థలానికి పంపినట్లు తెలిపారు. ఇక ఘటనకు సంబంధించిన వివరాలపై రైల్వే అధికారులను అడగ్గా సహాయక చర్యల అనంతరం కారణాలపై ఆరా తీస్తామని తెలిపారు. ఘటనకు కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. Bihar