CBN
టీడీపీ పద్దతి అంతా విచిత్రంగా కనిపిస్తోంది. చంద్రబాబు జైలు పాలయినప్పుడు నిజం గెలవాలంటూ కోట్లు ఖర్చు చేసే బస్సుతో అట్టహాసంగా వీధుల్లో తిరిగి డబ్బులు పంచిన చంద్రబాబు భార్య భువనేశ్వరి ఇప్పుడు మళ్లీ ఆ ఊసెత్తడం లేదు. టీడీపీ ధోరణి చూస్తుంటే చంద్రబాబు బయటకు రాగానే నిజం గెలిచేసినట్లు ఫీలవుతున్నారా? బాబు ఉన్నది మధ్యంతర బెయిల్ పై. బెయిల్ పై ఇవాళో రేపో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మధ్యంతర బెయిల్ ను పొడిగించుకుంటారని, మరోసారి జైలుకు వెళ్లకుండా చూసుకుంటారని అంచనాలు వినిపిస్తున్నాయి. బాబుగారి సంగతి పక్కన పెడితే.. నిజం అనే పదానికి నిర్వచనం చంద్రబాబు నాయుడు అని టీడీపీ ప్రచారం చేసింది. ఆయన బయటకొస్తే నిజం గెలిచినట్లు.. మరి ఆయన మళ్లీ జైలు పాలయితే..
అప్పుడేమంటారు?
స్కిల్ స్కామ్ లో చంద్రబాబు CBN అరెస్టవగానే ఏపీ వ్యాప్తంగా 200 నుంచి 300 మంది షాక్ తో, అభిమానంతో ప్రాణాలు కోల్పోయారుట. ఏదో లిస్టు తయారు చేసి కొంత సొమ్మును కూడా వారికి ఇచ్చేందుకు భువనేశ్వరితో ఓ ఇమిటేషన్ ప్రోగ్రాం చేయించింది టీడీపీ. ఒక్కో బాధిత కుటుంబానికి మూడు లక్షల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటి వరకూ మహా అయితే ఓ ఐదారుగురికి ఈ సొమ్మును పంచారేమో అంతే.. ఇంతలోనే బాబుగారికి మధ్యంతర బెయిల్ రావడంతో భువనేశ్వరి యాత్రను మధ్యలోనే వదిలేసి ఇంటికెళ్లిపోయారు. ఒకవేళ చంద్రబాబు మళ్లీ జైలు పాలయితే భువనమ్మ యాత్రం కంటిన్యూ అవుతుందేమో.. ఇలా టీడీపీ చెబుతున్నట్లుగా చంద్రబాబుకోసం మరణించిన అభిమానులకు ఆర్ధిక సాయం అనే ప్రోగ్రాం బాబుగారి బెయిల్ మీద ఆధారపడి ఉంది. ఒకవేళ బెయిల్ దొరికితే ఈ యాత్ర ఊసు మళ్లీ టీడీపీ ఎత్తదేమో.. లేదా చంద్రబాబు మళ్లీ జైలు కెళితే అప్పుడు బస్సు వేసుకుని జనంలో తిరుగుతారేమో.. అంటే మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అన్నది అధినేత బెయిల్ తో లింక్ అయి ఉందన్న మాట.
జైలు పాలయితేనే ప్రాణాలు కోల్పోతారా? CBN
అసలు ఎవరైనా మహా నేత చనిపోతే ఆ షాక్ ను తట్టుకోలేక ప్రాణాలు విడిచే వారిని చూస్తుంటాం.. కానీ అధినేత జైలు పాలయితేనే షాక్ తో చనిపోయే సంఘటనలు ఎక్కడా లేవు విడ్డూరం కాకపోతే.అంటే నిజానికి బ్రాండ్ అంబాసిడర్ గా చంద్రబాబును జనం నమ్ముతున్నారా? ఆయనకు నిజంగానే అంత పేరు ప్రతిష్టలు ఉంటే జనంలో ఆయన గ్రాఫ్ పీక్స్ లో ఉంటే 2019 ఎన్నికల్లోనే గెలిచే వారుకదా.. కాబట్టి ఇదంతా పాతాళంలో పడిపోయిన టీడీపీని జాకీలు పెట్టి లేపే స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అన్నమాట.
భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రలో ఉండగానే విజయనగరం దగ్గర దారుణ రైలు యాక్సిడెంట్ అయ్యింది. యాత్రలో ఉన్న భువనేశ్వరి యాత్రకు విరామం ఇచ్చి మరీ విజయనగరం వెళ్లి బాధితులను పరామర్శించారు. ఇంతలో చంద్రబాబు బెయిల్ పై బయటకొచ్చారు.దాంతో భువనమ్మ ఇంటికెళ్లిపోయారు.
బెయిల్ కి సాయానికీ లింకా?
టీడీపీ భవిష్య నేతగా భువనేశ్వరిని ప్రొజెక్ట్ చేయడానికే ఇంత స్కెచ్ వేశారా అని చూసేవారికి సందేహాలు వస్తున్నాయి. లోకేష్ నాసిరకం పెర్ఫార్మెన్స్ చూశాక పార్టీ పగ్గాలు బయటకు పోకుండా భార్యకే అప్పగించాలనే ఉద్దేశంతో జైలు నుంచి చంద్రబాబు డిజైన్ చేసిన ప్రోగ్రామే ఇది అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.. ఏదైతేనేం. . మొదలు పెట్టిన పనిని పూర్తి చేయాలిగా? అలా మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడం ఎందుకు?అంటే బెయిల్ తీర్పుపై భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర భవిష్యత్తు ఆధారపడి ఉందా?