మహారాష్ట్ర్రలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబయి నగరం వానలో నానుతుంది. రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. ముంపునకు గురైన ప్రాంతాల నుంచి ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బృహన్ ముంబయి కార్పొరేషన్ అధికారులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది జాయింట్ గా సహాయక చర్యలు చేపట్టారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
80 మంది ఆచూకీ…
మహారాష్ఠ్రలోని రాయగఢ్ లో మృతుల సంఖ్య 22కు చేరింది. ఎనభై మంది జాడ తెలియడం లేదని స్థానికులు చెబుతున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. రాయగఢ్ జిల్లాలోని ఇర్షల్ వాడీలో కొండచరియలు విరిగిపడి దాదాపు పదిహేడు ఇళ్ల వరకూ ధ్వంసమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతోనే ఈ ప్రమాదం జరిగింది. ఆచూకీలేని గ్రామస్థులు కొండచరియలు విరిగినప్పుడు గ్రామంలో ఉన్నారా? లేదా?అన్నది కూడా తెలియరావడం లేదు. శిధిలాల తొలగింపు కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది. మృతుల సంఖ్య కూడా మరింత పెరగనుంది.