Varun Tej
మెగా ఫ్రిన్స్ వరుణ్ తేజ్ విభిన్న కథనాలను ఎంపిక చేసుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు ఈ యువ హీరో. చిన్న పెద్ద డైరెక్టర్లన్న బేధం లేకుండా కాన్సెప్ట్ కే ప్రాధాన్యతనిస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్నాడు వరుణ్. పెళ్లి పనిలో కొద్ది రోజులు బిజీగా ఉండి సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. పెళ్లి వైభవంగా జరగటంతో ఇక కెరీర్ పై ఫోకస్ పెట్టాడు వరుణ్….. సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడటానికి మరొక సినిమాతో మన ముందుకు వస్తున్నాడు.
ఈ మధ్యకాలంలో గని, గాండివ దారి అర్జున సినిమాల్లో నటించాడు…..సినిమాలు మాత్రం బోల్తా కొట్టాడంతో హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక ఇప్పుడు న్యూ మూవీతో మన ముందుకు వస్తున్నాడు. వరుణ్ పెళ్లి తరువాత నటిస్తున్న తొలి సినిమా పలాస. ఇక ఈ మూవీలో వరుణ్ తేజ్ ను సరి కొత్త పాత్రలో చూపించబోతున్నారట మేకర్స్. వరుణ్ కెరీర్ లో పాన్ ఇండియా సినిమాగా రానుందట.
నాలుగు విభిన్న పాత్రల్లో నటించనున్న వరుణ్:
వరుణ్ ఎప్పుడు కనిపించని విభిన్న పాత్రల్లో నటించబోతున్నాడట. వరుణ్ మూవీ కెరీర్ సరి కొత్త గెటప్ లో చూడబోతున్నామట. తాజాగా అందిన సమాచారం ప్రకారం వరుణ్ తేజ్ ఈ మూవీలో నాలుగు విభిన్నమైన గెటప్పుల్లో కనిపించబోతున్నాడట. ఈ వార్త తెలిసిన ప్రేక్షకులు సంతోష పడుతున్నారు. వరుణ్ కెరియర్ లోనే ఈ సినిమా హైయెస్ట్ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కింబోతున్నట్లు తెలుస్తుంది. యావత్ దేశాన్ని కదిలించే ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా మన ముందుకు రానుందట. Varun Tej
ఈ మూవీలో చాలా యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయట. నలుగురు ఫైట్ మాస్టర్లు యాక్షన్ సన్నివేశాలను డైరెక్ట్ చేయబోతున్నారట. 1958-1982 మధ్యకాలంలో జరిగే కథ ఇది. అప్పటి వాతావరణానికి సెట్ అయ్యేలాగా భారీ సెట్టింగులను నిర్మిస్తున్నారట మేకర్స్. పురాతన కాలం లో లోకేషన్స్ అన్ని సెట్ చేయడానికి భారీ సెట్టింగ్ ను ఏర్పాటు చేయడానికి చాలా టైమ్ పడుతుందని సమాచారం. వైజాగ్ నేపథ్యంలో ఈ సినిమా రానుందట. హైదరాబాద్ ఓల్డ్ వైజాగ్ సిటీని తలపించే విధంగా ఈ సినిమా సెట్టింగ్ నిర్మిస్తున్నట్లు సమాచారం.
మూవీ మేకర్స్ Varun Tej
వరుణ్ తేజ్ కి జోడిగా నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ మూవీకి కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వం కరుణ కుమార్ వహిస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. నవీన్ చంద్ర, కన్నడ కిశోర్ కీలక పాత్రల్లో నటింస్తున్నారట. అజయ్ ఘోమ్, మైమ్ గోపి, రూపలక్ష్మి, విజయరామరాజు, జగదీశ్, రాజ్ తిరందాస్ తదితరులు ఇతర పాత్రల్లో షోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా మెన్ గా జీవీ ప్రకాశ్ కుమార్ పనిచేస్తున్నాడు. వైర ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది. మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి కలిసి భారీ ఎత్తున ఈ సినిమాను తెరకెక్తిస్తున్నారు. ప్రస్తుతం పలాస మూవీ ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందట.