Virat
ఈ ప్రపంచ కప్ లో లెజండరీ బ్యాట్స్ మెన్ విరాట్ కొహ్లీ మరో అద్భుతానికి శ్రీకారం చుడుతున్నాడు. అదే వన్డే మ్యాచుల్లో 50వ సెంచరీ… విరాట్ ఈ అద్భుతాన్ని సాధిస్తాడా? అభిమానులైతే గన్ షాట్ గా సాధిస్తాడని గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. నవంబర్ 5న ఈడెన్ గార్డెన్స్ లో దక్షిణాప్రికాతో జరిగే వన్డే వాల్డ్ కప్ మ్యాచ్ లో కొహ్లీ తన50వ సెంచరీ కంప్లీట్ చేస్తాడని సునీల్ గావస్కర్ అంచనా వేస్తున్నాడు. పైగా ఆరోజు విరాట్ కొహ్లీ పుట్టిన రోజు కూడా..న్యూజీలాండ్ తో జరిగిన మ్యాచ్ లో కొహ్లీ 5 పరుగుల తేడాతో తన 48వ సెంచరీ మిస్ అయ్యాడు. అయితే దక్షిణాఫ్రికా మ్యాచ్ కన్నా ముందు మరో రెండు మ్యాచ్ లు భారత్ ఆడాల్సి ఉంది. వీటిల్లో విరాట్ మరో రెండు సెంచరుల పూర్తి చేసి 50వ సెచంరీ దక్షిణాఫ్రికాతో పూర్తి చేస్తాడంటూ గవాస్కర్ జోస్యం చెబుతున్నాడు. కొల్ కాతా ఈడెన్ గార్డెన్స్ ఆరోజు లేచి నిలబడి మరీ విరాట్ కు ప్రణమిల్లుతుంది.స్టేడియం మొత్తం ఈలలు, కేకలు, అరుపులతో మార్మోగిపోతుందంటూ గవాస్కర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. వన్డేలలో 49 సెంచరీలు చేసిన వ్యక్తి సచిన్ టెండూల్కర్.. టెండూల్కర్ రికార్డును సమం చేయడానికి ఒక సెంచరీ దూరంలో ఉన్న విరాట్, వాల్డ్ రికార్డ్ క్రియేట్ చేయడానికి రెండు సెంచరీల దూరంలో మాత్రమే ఉన్నాడు.
భార్యే సర్వస్వం
మన క్రికెటర్లలో ఆణి ముత్యం విరాట్ కొహ్లీ.. రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందాడు. సోషల్మీడియాలో ఫాలోవర్లూ ఎక్కువే. ఒక్క ఇన్స్టాగ్రామ్ లోనే కోహ్లీకి 252 మిలియన్లకుపైగా ఫాలోవర్లు ఉన్నారు.రీసెంట్ గా విరాట్, అనుష్క శర్మ కలిసి నిసర్గ అనే కొత్త ప్లాట్ ఫామ్ ను మొదలు పెట్టారు. ఈవెంట్స్ ను, వాటితో పాటు తమ అనుభవాలను ఈ ప్లాట్ ఫామ్ ద్వారా ఈ జంట షేర్ చేసుకోబోతోంది.మేధో సంపత్తికి పదు పెట్టే కొత్త కొత్త ఈవెంట్లను ఈ వేదిక ద్వారా పరిచయం చేస్తారు.కొహ్లీ భార్యా విధేయుడు..అనుష్క శర్మ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అసలు చిన్నప్పుడే తానొక నటిని పెళ్లి చేసుకోవాలని కలలు కనేవాడట. పెద్దయ్యాక ఈ రూపంలో ఆ కోరిక నెరవేర్చుకున్నాడు విరాట్.. పెళ్లికి ముందు ఉన్న ప్రేమ బంధమే చెక్కు చెదరకుండా ఈరోజుకీ వారి మధ్య కొనసాగుతోంది. అలాగే తన ముద్దుల పట్టి వామికా అన్నా ఈ జంటకి ఎంతో అపురూపం.. అనుష్క శర్మ నుంచి తానెన్నో జీవన సత్యాలను నేర్చుకున్నానని, వాటిని సిన్సియర్ గా ఫాలో చేస్తాననీ అంటాడు విరాట్..
బ్రాండ్ల రారాజు… సంపన్న క్రికెటర్
ఒకప్పుడు నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన కొహ్లీ నేడు అత్యంత సంపన్నుడు. క్రికెట్ ఆట ద్వారా అతగాడు సంపాదించిన ఆస్తులు చాలా చాలా విలువైనవి. అత్యంత విలువైన ఆటగాడిగా మారిన కోహ్లి ఆస్తుల విలువ రూ.వెయ్యి కోట్లకు పైనే ఉంటుందని స్టాక్ గ్రో అనే కంపెనీ గణాంకాలను వెల్లడించింది.
సేవాభావం ఎక్కువే… Virat
అంతే కాదు విరాట్, అనుష్కల జంట ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నడుపుతోంది. 2013లో కోహ్లి ఒక ఫౌండేషన్ ను స్థాపించాడు, పేద పిల్లలకు సహాయం చేయడానికి దాతృత్వ లక్ష్యంతో ఈ సంస్థను నడుపుతున్నాడు. అనాధ పిల్లల సంక్షేమం , శ్రేయస్సును కాంక్షించే లక్ష్యంతోఅనేక NGO సంస్థల సహకారంతో ఈ ఫౌండేషన్ ను నడుపుతున్నాడు. 2014లో, ఫౌండేషన్ eBayమరియు సేవ్ ది చిల్డ్రన్ ఇండియా నిర్వహించిన స్వచ్ఛంద వేలంలో పాల్గొంది. దీని ద్వారా వచ్చే ఆదాయం నిరుపేద పిల్లల విద్య మరియు ఆరోగ్య సంరక్షణకు వినియోగిస్తున్నారు. స్పోర్ట్స్ ఆధారిత కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా మరియు వారికి అవసరమైన వనరులను అందించడం ద్వారా పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును సృష్టించేందుకు కోహ్లీ అంకితభావంతో ఉన్నాడు. కోహ్లీకి సొంతంగా చాలా బ్రాండ్లున్నాయి. బ్లూట్రైబ్, యూనివర్సల్ స్పోర్ట్స్బిజ్, ఎంపీఎల్, స్పోర్ట్స్ కాన్వో లాంటి ఏడు స్టార్టప్స్లో క్రికెట్ లో సంపాదించిన సొమ్మును ఇన్వెస్ట్ చేశాడు. అటు క్రికెట్ ఆట, ఇటు సేవా కార్యక్రమాలతో బిజీగా ఉన్న విరాట్ మరోసారి తండ్రి కాబోతున్నాడు. మంచి మనసు , ఆటపట్ల అంకిత భావం కలిగిన విరాట్ కొహ్లీ ఈ ప్రపంచ కప్ లో సరికొత్త ప్రపంచ రికార్డు సాధించాలని కోరుకుందాం… Virat