ఇంటిపేరునుంచి ఓ స్పెషల్ నిక్ నేమ్ ను సంపాదించుకున్న ఏకైక స్టార్ క్రికెటర్ వి.వి.ఎస్. లక్ష్మణ్. (VVSL) వి.వి.ఎస్ అంటే ఆయన ఇంటిపేరు కావచ్చు.
కానీ అభిమానులకు మాత్రం వీవీఎస్ అంటే వెరీవెరీ స్పెషల్ అన్నమాట.క్రికెట్ చరిత్రలో తన కంటూ కొన్ని పేజీలు లిఖించుకున్న అతికొద్దిమంది తెలుగు క్రికెటర్లలో లక్ష్మణ్ ఒకరు.
మైదానంలోకి దిగాడంటే ఇక చిచ్చర పిడుగే.. తనుగురువైన మహ్మద్అజారుద్దీన్ లాగే రిస్ట్ ను అన్ని వైపులకీ తిప్పి బ్యాటింగ్ చేయగలడు.
హార్డ్ బాల్ లేదా కొత్త బంతిని సైతం అద్భుతంగా ఎదుర్కొనగల అతి కొద్దిమంది బెస్ట్ ప్లేయర్లలో లక్ష్మణ్ ఒకడు అని జెఫ్రీ బాయ్ కాట్ కూడా ప్రశంసించాడు.
అలాగే బ్యాటింగ్ లో కూడా ఏ ఆర్దర్ లోనైనా ఆడగల ధీరుడు ఓపెనింగ్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకూ ఏ పొజిషన్ లోనైనా అదురు,బెదురు లేకుండా ఆడగల సత్తా ఉన్నవాడు.
1994 వ సంవత్సరంలో అండర్19 టీం కి సెలెక్ట్ అయిన లక్ష్మణ్ తన పవర్ చూపించాడు.ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో 150 కి పైగా పరుగులు చేసి క్రికెట్ సెలెక్టర్స్ అందరినీ తన వైపు చూసేలా చేశాడు. లక్ష్మణ్ ఆడిన ప్రతి రంజీ సీజన్లో కూడా పరుగుల వర్షం కురిపించాడు.
1995- 96 రంజీ సీజన్ లో 11 ఇన్నింగ్స్ ఆడిన వివిఎస్ 86 సగటుతో 777 పరుగులు చేశాడు ఆ తర్వాత కూడా ప్రతి సీజన్ లో ప్రతి టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించి ఇండియన్ నేషనల్ టీం లోకి అడుగు పెట్టాడు.
లక్ష్మణ్ ఇంటర్నేషనల్ లోకి తొలి అడుగు… (VVSL)
1996లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా లక్ష్మణ్ (VVSL) తన మొట్ట మొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు.
ఆతర్వాత ఓపెనర్గా ప్రమోట్ అయినటువంటి లక్ష్మణ్ అనుకున్నంత స్థాయిలో ఆడలేకపోయాడు. అదేవిధంగా వన్డే టీమ్ లో కూడా స్థానం సంపాదించుకొని మొదటి మ్యాచ్లో డక్ ఔట్ అవ్వడం కారణంగా తన ప్లేస్ ని కోల్పోయాడు. ఆవిధంగా తన ఇంటర్నేషనల్ క్రికెట్ కు దూరం అయ్యాడు.
అలాంటి సందర్భంలో ఎంతో నిరుత్సాహానికి గురైనప్పటికీ పట్టు వదలక మళ్లీ రంజీ మ్యాచ్ లో ఆడడం స్టార్ట్ చేసాడు. విశ్వరూపాన్ని చూపించడం మొదలు పెట్టాడు.ఆ సీజన్ లో మొత్తం తొమ్మిది మ్యాచ్ లు ఆడి 108 సగటుతో ఏకంగా 1410 పరుగులు చేశాడు. ఇప్పటికి ఒక రంజీ సీజన్లో పరుగులు చేసిన రికార్డ్ ఇతని పేరిటే ఉంది. ఆ తర్వాత తన ఆటను చూసిన సెలెక్టర్లు మళ్ళీ పిలిచి భారత జాతీయ జట్టులోకి తీసుకున్నారు.
రికార్డుల్లోకి లక్ష్మణ్ … (VVSL)
2001లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో బ్యాటింగ్ తో పరుగుల వర్షం కురిపించాడు రెండో మ్యాచ్ లో లక్ష్మణ్ (VVSL) చేసిన 281 పరుగులు అత్యంత ఎక్కువ వ్యక్తిగత స్కోర్ గా రికార్డుల్లోకి ఎక్కింది.
ఆ తర్వాత ఈ రికార్డ్ ని వీరేంద్ర సెహ్వాగ్ తన ట్రిపుల్ సెంచరీతో బద్దలు కొట్టాడు.
ఇది తన కెరియర్ కి అతి పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు అక్కడి నుంచే భారత జాతీయ జట్టులో రెగ్యులర్ ప్లేయర్ అయ్యాడు.
వన్డేల్లో కూడా భారీ స్థాయిలో రాణించాడు మిడిలార్డర్లో తన ప్లేస్ ని పర్మినెంట్ చేసుకున్నాడు.
పక్కా హైదరాబాదీ (VVSL)
వంగిపురపు వెంకట సాయి లక్ష్మణ్ నవంబర్ 1, 1974లో హైదరాబాదులో జన్మించాడు. లక్ష్మణ్ తండ్రి డాక్టర్ శాంతారామ్ తల్లి పేరు డాక్టర్ సత్యభామ.
ఈయన క్రికెటర్ కాకుండా ఉండి ఉంటే గనుక తప్పనిసరిగా డాక్టర్ అయ్యేవాడినని పలు మార్లు ఇంటర్వ్యూలలో చెప్పడం జరిగింది.
భారత రెండో రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ముని మనుమడు కూడా..లక్ష్మణ్ డాక్టర్ల కుటుంబంలో పుట్టడం కారణంగా అతనిని ఒక డాక్టర్ గా చేయాలని తన కుటుంబ సభ్యులు అనుకున్నారు.
కానీ చిన్నప్పట్నుంచి క్రికెట్ మరియు టేబుల్ టెన్నిస్ అంటే చాలా ఇష్టం దీనితో వీటిపైనే శ్రద్ధ పెట్టాడు. తనకు సమయం దొరికినప్పుడల్లా క్రికెట్ ని ఎక్కువగా ఆడేవాడు.ఈయన కేవలం ఆటలు ఆడడం మాత్రమే కాదు చదువు పైన కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టే వాడు.పదో తరగతిలో 98 శాతం ఉత్తీర్ణత సాధించాడు.