రానున్న వారం రోజులు హైదరాబాద్ వాసులు అలర్ట్ గా ఉండాలని ప్రభుత్వం కోరింది. ఏడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు సాధ్యమయినంత వరకూ జలాశయాల వద్దకు వెళ్ల వద్దని సూచించింది. హుస్సేన్ సాగర్ నిండుకుండలా తలపిస్తుంది. హుస్సేన్ సాగర్ నుంచి రెండువేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఈరోజు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ జీహెచ్ఎంసీ అధికారులతో కలసి హుస్సేన్ సాగర్ ను పరిశీలించారు.
సమన్వయంతో పనిచేయాలని…
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. నాలాలపై అక్రమ నిర్మాణలను తొలగించే విషయంపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 24 గంటలు పనిచేసేలా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ప్రజలు ఎలాంటి ఫిర్యాదులున్నా వెంటనే కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయాలని తెలిపారు. 426 మాన్ సూన్ ఎమెర్జెన్సీ టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.