తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా సాటునీటిని ఈరోజు రాష్ట్ర్ర హోంమంత్రి తానేటి వనిత విడుదల చేశారు. తాళ్లపూడి మండలంలో తాడిపూడి ఎత్తిపోతల పథకం నుంచి నీటిని భూములకు విడుదల చేశారు. ఈ సందర్భంగా తానేటి వనిత మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. రైతుల అభివృద్ధి కోసం వారి ఇంటి ముంగిటనే సేవలను అందించే విధంగా ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిందని తానేటి వనిత ఈ సందర్భంగా అన్నారు.
తాడిపూడి నుంచి…
తాడిపూడి ఎత్తిపోతల పథకం వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించిన తానేటి వనిత అనంతరం నీటిని విడుదలచేశారు. పంటలు బాగా పండి రైతులకు మంచి జరగాలని హోంమంత్రి ఆంకాంక్షించారు. ఈ ఎత్తిపోతల పథకం నుంచి ఈ ఏడాది లక్ష యాభై ఏడు వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. జగన్ ప్రభుత్వానికి రైతులు అండగా నిలబడాలని కోరారు. జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండుతున్నాయని ఆమె గుర్తు చేశారు.