ఏ ఇంట్లో అయిన దేవుడి కోసం ఓ ప్రత్యేకమైన స్థలాని కేటాయిస్తారు. కుదిరిన వారు పూజ గది(Pooja Room) ఏర్పాటుచేసుకుంటారు, తక్కిన వారు ఇంట్లోనే ఒక దగ్గర దేవిని చిత్రపట్టని ఉంచి ఆ స్థలాన్ని దేవుని పూజ కు పెట్టుకుంటారు. పూజగది లో సాధారణం గా అందరు తమకు ఇష్టమైన దేవుళ్ళ చిత్రపటాలు,విగ్రహాల అను పెట్టుకొని పూజిస్తుంటారు.మరి కొంతమంది పూజ గదిలో(Pooja Room) ఎన్నో వస్తువులు పెడుతుంటారు. దేవుని గుడి ఎంత పవిత్రమో.. మన ఇంట్లో పూజ గది(Pooja Room) కూడా అంతే పవిత్రం అని గుర్తుంచుకోవాలి. మరి పూజ గది లో ఎలాంటి వస్తువులు. విగ్రహాలు ఉండకూడదో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. ఉగ్ర శివుడు:
కొంతమంది శివుని చిత్ర పట్టని పూజ గది లో పెట్టుకుంటారు అందులో ఎలాంటి తప్పు లేదు కానీ ఆ చిత్ర పటం లో ని శువుని నిర్మలంగా నవ్వుతూ ఉన్నట్టు ఉండాలట. అంతేకానీ ఉగ్రరూపం లో ఉన్న శివుని ప్రతిమ ఉండటం అంత మంచిది కాదని పండితులు చెబుతున్నారు.
2. భైరవనాధుడు :
ఇంట్లో పూజ గది(Pooja Room) లో భైరవనాధుని చిత్రపట్టం కాని విగ్రహం కానీ పెట్టుకోకూడదట ఎందుకంటే ఈ భయారవనాధుని అవతారం ఉగ్ర శివుని అవతారంగా మన పూరణ గ్రంధాల్లో చెప్పబడిందట.
3. మహంకాళి అమ్మ :
మహంకాళి అమ్మవారి రూపాన్ని ఒకసారి చుసిన ఎవరు మర్చిపోలేరు. అమ్మవారు సాక్షాత్తు పార్వతీదేవి యొక్క స్వరూపం.ఈ పార్వతి దేవి స్వరూపం అయినా మహంకాళి అమ్మవారు చాలా ఉగ్రరూపం తో నిజానికి అంత్యంత భయంకరమైన రూపం లో ఉంటారు ఇళ్ల ఉన్న అమ్మవారిని పార్వతి దేవి ఉగ్రరూపంగా భావిస్తారట.ఇలా ఉగ్ర రూపం లో ఉన్న అమ్మవారి చిత్రపటాన్ని మనం పూజ గది ఉంచి పూజిస్తే అనుకూలతలు కన్నా ప్రతికూల ఫలితాలే వస్తాయట, ఇంట్లో లో వారందరికీ మానసిక అశాంతి తో పాటు ఇంట్లో ఎపుడు సుఖసంతోషాలు ఉండవట కాబ్బటి ఈ పార్వతి ఉగ్రరూపం అయినా మహంకాళి అమ్మవారిని కాకుండా మరేదయినా పార్వతి దేవి స్వరూపాన్ని అయినా పూజ గది లో(Pooja Room) ఉంచి పూజించుకోవచ్చని పండితులు చెబుతున్నారు.
4. శనేశ్వరుడు :
మనలో చాలా ముందుకి శనేశ్వరుడు అంటే ఎంతో భయం అసలు చాలా మందికి అనేకన్నా అందరికి అనే చెప్పవచ్చు.శనిదశ, శని అంతర్దశ, ఏలినాటి శని,అర్ధాష్టమ శని అంతే మరి భయం. అసలు నిజానికి శనేశ్వరుడు న్యాయ దేవుడిగాను,మంచి కార్యం చేస్తే అంతకు రేటింపు మంచి ఫలితాలను అందించే దేవుడట కానీ శనిదేవుడు ఎవరి జాతకం లో అయినా మంచి స్థానం లో లేకపోయినట్లు అయితే వారు ఎన్నో ఇబండ్లు పడతారని జ్యోతిష్య పండితులు పెబుతున్నారు. అలంటి శనేశ్వరుని విగ్రహం కానీ చిత్ర పటాన్ని కానీ ఎట్టి పరిస్థితులలో ను ఇంట్లో ని పూజ గది(Pooja Room) లో పెట్టుకోకూడదు అని చెబుతున్నారు.
5. రాహువు -కేతువు :
నవగ్రహాలలో శనేశ్వరుని కి ఎంత ప్రాధాన్యత ఉందొ అంతే ప్రాధాన్యత కలిగిన దేవుళ్ళు రాహువు, కేతువు.ఈ గ్రహాలను ఛాయా గ్రహాలు అని అంటారట. ఈ గ్రహ దేవుళ్ళు ఇద్దరు సర్ప రూపాన్ని కలిగి ఉంటారు. మానసిక ఆందోళన,కోపం,ఏయ్ పనులు సరిగా ముందుకు పోవడం లేదు అని జ్యోతిష్య పండితుల దగ్గర కు వెళ్తే వారు ఎన్నో పరిహారాలు చెబుతారు కానీ ముందుగా చెప్పేవి మాత్రం ఈ రెండే..
1. శనేశ్వరునికి పూజ అభిషేకాలు చేస్కోండి.
2. రాహు-కేతు పూజ చేస్కోండి.
ఈ రెండు పూజలు అనేక ఇబ్బందులను తొలంగించి మనకు బాధల నుండి విముక్తి కలిగిస్తారని మనం కూడా అదే విశ్వాసం తో చేస్తుంటాము. కానీ ఎట్టి పరిస్థితులలోను ఈ రాహు-కేతువుల విగ్రహాలని కానీ చిత్ర పట్టాలని కానీ ఇంట్లో లో ని పూజ గది లో పెట్టకూడదు అంటున్నారు.ఈ పైన చెప్పిన దేవి దేవత విగ్రహాలకు ఎలాంటి పూజ చెయ్యకూడదు అని కాదట,కేవలం ఈ విగ్రహాలను చిత్రపటాలను ఇంట్లో పూజ చెయ్యకూడదుట కానీ బయట దేవాలయాలలో పూజ చేసుకోవచ్చట.