2027 వాల్డ్ కప్ కి ఎవరెవరుంటారు?
ఎన్నో రోజుల నుంచి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచుతూ వచ్చిన వరల్డ్ కప్ 2023 ఎడిషన్ ఇటీవల జరిగిన ఫైనల్ మ్యాచ్ తో ముగిసింది . ఈ టోర్నీలో భారత్కు కూడా భంగపాటు తప్పలేదు. దీంతో ప్రపంచకప్ టోఫ్రీ కోసం టీమ్ఇండియా మరో నాలుగేళ్లు ఆగాల్సిందే. ఆ క్రమంలో కొందరు ప్లేయర్లు వచ్చే వరల్డ్కప్ నాటికి జట్టులో ఉండకపోవచ్చు. అయితే ఈసారి వాల్డ్ కప్ కోసం కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించింది ఐసీసీ.
2027 వాల్డ్ కప్ కోసం ఫార్మాట్ మార్పు
2023 సమరం ముగిసింది కాబట్టి ఇక అందరి దృష్టి 2027 ప్రపంచకప్పైనే. నాలుగేళ్ల తరువాత ఆ టోర్నీ సరికొత్త అనుభూతి పంచబోతోంది. ఈసారి మెగా టోర్నీకి దక్షిణాఫ్రికా, జింబాబ్వేతో పాటు నమీబియా ఆతిథ్యం ఇస్తున్నాయి. దక్షిణాఫ్రికా రెండోసారి ఆతిథ్యం ఇస్తుండగా నమీబియా తొలిసారి ప్రపంచ కప్కి వేదిక అవుతోంది. 2027నవంబర్లో జరిగే ఈ టోర్నీలో 14 జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. మొత్తంగా ఈ టోర్నమెంట్లో 54 మ్యాచులు జరుగుతాయి . జట్ల అర్హత కోసం 2003లో ప్రవేశపెట్టిన విధానాన్నే అనుసరించనున్నారు. సవరించిన ఫార్మాట్ను మరోసారి పరిచయం చేస్తుంది. ఈ పద్ధతిని 1999 ప్రపంచకప్లో ఉపయోగించారు.
2027 క్రికెట్ ప్రపంచ కప్ కు అర్హులు ఎవరంటే..
అయితే 2023 మాదిరే 2027లో ఫార్మాట్ ఉండనుంది. ఈసారి 10 జట్లు రౌండ్ రాబిన్ లీగ్లో తలపడ్డాయి. దీంతో ఒక్కో జట్టు మిగతా తొమ్మిది జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడింది. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్ చేరాయి. కానీ వచ్చే 2027 ప్రపంచకప్ లో అలా కాదు మొత్తం 14 జట్లు 2 భాగాలుగా ఏడేసి చొప్పున విభజిస్తారు. ఒక్కో గ్రూప్లో ఒక్కో జట్టు మిగతా ఆరు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఆ గ్రూప్ల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్ సిక్స్ కు అర్హత సాధిస్తాయి. అనంతరం తొలి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు సెమీస్ చేరతాయి. సెమీస్లో గెలిచిన రెండు జట్లు ఫైనల్లో తలపడతాయి. ఇప్పటికే ఆతిథ్య హోదాలో దక్షిణాఫ్రికా, జింబాబ్వే ప్రపంచకప్కు అర్హత సాధించాయి. వన్డే ర్యాంకింగ్స్లో తొలి 8 స్థానాల్లో నిలిచే జట్లు నేరుగా ఈ ప్రపంచకప్ ఆడతాయి. గ్లోబల్ క్వాలిఫయర్ టోర్నీల నుంచి మిగతా నాలుగు జట్లు వస్తాయి. అయితే ఈ ప్రపంచ కప్ లో నమీబియా ఆడాలంటే మాత్రం అర్హత మ్యాచ్ ల ద్వారానే సంపాదించాల్సి ఉంటుంది.
నమీబియా తొలిసారి ఆతిథ్యం…
నమీబియా మొదటిసారిగా టోర్నమెంట్కు సహ హోస్ట్ చేస్తుంది. అయితే వారి భాగస్వామ్యంపై పూర్తి హామీ లభించలేదు. నమీబియా పూర్తి ఐసీసీ సభ్య దేశం కాకపోవడమే దీనికి కారణం. అంటే నమీబియా టోర్నీలో తన స్థానాన్ని కాపాడుకోవడానికి ప్రామాణిక అర్హత నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. 2003 నుంచి నమీబియా వన్డే ప్రపంచకప్లో పాల్గొనలేదు.
ఈ సారి ప్రపంచ కప్ కి సినియర్ ప్లెయర్ కష్టమే…….
భారత్ వేదికగా జరిగిన మెగా ప్రపంచకప్ ముగిసింది. తొలి మ్యాచ్ నుంచి ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచు వరకు ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉత్కంఠ మ్యాచులు క్రీడాభిమానులను ఉర్రూతలూగించాయి. తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు క్రికెట్ ఫ్యాన్స్ దేశ విదేశాల నుంచి తరలివచ్చారు. దీంతో మ్యాచులు జరిగే స్టేడియాలన్నీ దాదాపుగా నిండిపోయాయి.ఇక 12 ఏళ్ల విరామం తర్వాత భారత్ కప్పు కైవసం చేసుకుంటుందని ఆశించిన భారత్ అభిమానులకు నిరాశ ఎదురైంది.చివరి మెట్టుపై బోల్తాపడిన టీమిండియా..
మరోసారి ఖాళీ చేతులతో వెనుదిరిగింది. అయితే ఇప్పుడు జట్టులో సినియర్ ప్లేయర్స్ కి తర్వాతి వరల్డ్ కప్ లో చోటు ఉండక పోవచ్చు. రోహిత్కు ఇప్పుడు 36 ఏళ్లు. 2027 వరల్డ్ కప్ నాటికి అతడికి 40 ఏళ్లు వస్తాయి. ఆ ఏజ్లో అతడు టోర్నీ ఆడటం కష్టమే.ప్రస్తుతం 33 ఏళ్ల వయస్సులో ఉన్న షమీ.. నాలుగేళ్ల నాటికి అంటే 37 ఏళ్ల వయసులో మరో టోర్నీ ఆడాల్సి ఉంటుంది.37 ఏళ్ల యవసులో ఉన్న రవిచంద్రన్ అశ్విన్కు ఇదే చివరి ప్రపంచకప్.ఇక విరాట్ కోహ్లీ వయసు 35 ఏళ్లు. ఫిట్నెస్ విషయంలో మేటి అయిన కోహ్లీకి వచ్చే వరల్డ్ కప్ నాటికి 39 ఏళ్లు వస్తాయి.కోహ్లీ ఫిట్నెస్ లెవెల్స్, ఫామ్ను బట్టి చూస్తే.. మరో 2 3 ఏళ్లు ఈజీగా ఆడేయచ్చు.కోహ్లీ గనక 2027 వన్డే ప్రపంచకప్ ఆడాలి అని అనుకుంటే కచ్చితంగా ఆడే అవకాశం ఉంది.కానీ సీనియర్లు మాత్రం మరో మూడేళ్లలో రిటైర్మెంట్ బాట పట్టొచ్చు. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించి వారికి తగిన శిక్షణ ఇవ్వాల్సి ఉంది.