why ap needs jagan ?
విద్య, వైద్య రంగాల్లో విప్లవం సృష్టిస్తున్న ఏపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో మంచి ఫలితాలే రావొచ్చని ఇప్పటికే సంకేతాలు అందుతున్నాయి. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం కూడా ముమ్మరంగా వాడవాడలా నిర్వహిస్తున్నాయి వైసీపీ శ్రేణులు. మళ్లీ రెండోసారి జగనే ఎందుకు అధికారం చేపట్టాలన్న అంశంపై అన్నీ వివరంగా చెబుతున్నారు. అనేక సంక్షేమ పథకాలతో పాటు, పారిశ్రామికాభివృద్ధి ద్వారా ఉపాధి కల్పించేందుకు జగన్ ప్రభుత్వం గట్టిగానే కృషి చేస్తోంది. తమ కుటుంబాలు, గ్రామం, మండలం, నియోజక వర్గం, జిల్లా, రాష్ట్రం ఇలా ప్రగతి పథంలో పరుగులు తీయాలంటే జగన్ లాంటి మాట తప్పని, మడమ తిప్పని యోధుడే కావాలంటూ వైసీపీ శ్రేణులు వివరించి చెబుతుండటంతో ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తోంది. విజయవాడ, విశాఖలలో భారీ ర్యాలీలే అందుకు నిదర్శనం.
జిల్లాలు, నియోజక వర్గాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల దగ్గర మునుపెన్నడూ లేనంత కోలాహలం కనిపించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వైసీపీ నియోజక వర్గాల ఇన్చార్జ్ లు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు ఇలా అన్ని స్థాయిల వ్యక్తులూ కదలి వచ్చి ఒక ఉద్యమంలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నాలుగున్నరేళ్లలో సాధించిన అద్భుత ఫలితాలను వివరించడమే కాదు,గత ప్రభుత్వం ,పవన్ కల్యాణ్ తో కలసి చేసిన మోసాలు, అప్పుల గురించి ప్రస్తుత ప్రభుత్వంపై ఆ భారం గురించి వివరిస్తున్నారు.
మాట తప్పని, మడమ తిప్పని నేత jagan
జగన్ అధికారంలోకి వచ్చింది మొదలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసే దిశగానే అడుగులు వేశారు. ఖజానా ఖాళీగా ఉన్నా, అప్పులు వెక్కిరిస్తున్నా.. కేంద్రం నుంచి రావాల్సిన సొమ్మును రాబడుతూ అన్ని వర్గాలకు, అన్ని పథకాలకు సర్దుతూ బాలెన్స్ చేసుకుంటూ ముందుకెడుతున్నారు. వైసీపీ మేనిఫెస్టోలో 99.5 శాతం హామీలను అమలు చేసింది ప్రభుత్వం. ప్రభుత్వం నిక్కచ్చిగా పనిచేస్తోంది కాబట్టే.. మీ బిడ్డ మంచి చేశాడని మీరు భావిస్తే.. ప్రతీ కుటుంబానికి ఏదో రకంగా మేలు జరిగిందని మీరు నమ్మితేనే నాకు ఓటయండంటూ జగన్ ప్రజలకు పిలుపు నిచ్చారు. సాధారణంగా ఇలాంటి ఛాలెంజ్ లు ఎవరూ చేయరు…
కానీ ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూల భావన ఉంది కాబట్టే సీఎం జగన్ ప్రజలకు ఇలాంటి విన్నపం చేశారు. ఇచ్చిన మేనిఫెస్టోకు కట్టుబడి ఉండటమే మాట తప్పని లక్షణం. కొన్ని హామీలను అమలు చేసే వీలు లేకపోయినా అది ఎందుకు సాధ్యం కాదో సవివరంగా చెప్పే దమ్ము, ధైర్యం జగన్ కు ఉన్నాయి. రైతు రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చి చంద్రబాబు ఆ తర్వాత చేతులెత్తేశారు. పైగా టీడీపీ మేనిఫెస్టోనే వెబ్ సైట్ నుంచి ఎత్తి పారేశారు. ఆపై చంద్రబాబుతో కలసి పవన్ కల్యాణ్ కూడా టీడీపీ తరపున హామీలిచ్చారు.కానీ ఏ హామీని టీడీపీ ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయింది.పైగా టీడీపీ ఇప్పుడు ఇస్తున్న హమీలన్నీ ఆచరణ సాధ్యం కానివే.
ఏపీ సీఎం ఎవరైతే బాగుంటుంది ?
ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీకి ఎలాంటి నాయకుడు అవసరం అన్నది పెద్ద ప్రశ్న.. 2019లో ఘోరంగా ఓడిపోయి, ఇప్పుడు స్కాముల్లో చిక్కుకున్న చంద్రబాబును ప్రజలు ఆదరించే పరిస్థితి కనిపించడం లేదు.పైగా ఇప్పుడా నేత కోర్టుల చుట్టూ బెయిల్ కోసం తిరుగుతున్నాడు. స్థిరమైన పాలన కోరుకునే ఓటర్లు ఇప్పుడు ఏపీ ప్రజలు జగన్ అయిదేళ్ల పాలనను,చంద్రబాబు 14 ఏళ్ల పాలనను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.తమ ఆకాంక్షలకు తగ్గట్లు పాలన సాగించే నేతలను జనం ఎన్నుకుంటారు.అంతేకానీ కక్ష పూరిత రాజకీయాలు, అవినీతిని జనం భరించరు. ఆ రీత్యా చూస్తే గత ఐదేళ్లుగా రాష్ట్రం ప్రశాంతంగానే ఉంది.. అప్పులు తీర్చుతూ,అభివృద్ధివైపు అడుగులు పడుతున్నాయి. ఎన్నికలకు ఆరునెలలు టైమ్ ఉన్నా.. ఇప్పటికే పలు మీడియా సంస్థలు, యూట్యూబర్లు ఏపీలో క్షేత్ర స్థాయిలో జనంలోకి వెళ్లి పబ్లిక్ పల్స్ ను పట్టుకుంటున్నారు… కాబట్టి సంక్షేమ పథకాలను బటన్ నొక్కి ప్రారంభించే సీఎం కు కృతజ్నతగా ఏపీ ప్రజలు కూడా ఈవీఎంలో ఫ్యాన్ గుర్తుకే బటన్ నొక్కుతారా?
why ap needs jagan ?