నేటి కాలం జబ్బు లేని మనుషులు లేరంటే అతిశయోక్తి కాదు. ముందు కలం మన పెద్దలు ఎంతో ఆరోగ్యం తో పొలం పనులు ఇంటి పనులు చక్కగా చేసుకునేవారు. మరి ముఖ్యంగా నేటి తరం మహిళలు ఎక్కువగా అనారోగ్య సమస్యలతో భాదపడుతున్నారు.మహిళల్లో ఎక్కువ గా కనిపించే నడుము నొప్పి తరువాత సమస్య (Migraine) మైగ్రేన్. వయస్సు తో నిమిత్తం లేకుండా మహిళల్లో ఈ మధ్య ఈ సమస్య బాగా పెరిగిపోయింది.పురుషులతో పోలిస్తే ఈ సమస్య మహిళల్లో మూడు రేట్లు ఎక్కువగా ఉందని అధ్యయనాలు. అసలు మైగ్రేన్ లక్షణాలు ఎలా ఉంటాయంటే..
మైగ్రేన్ లక్షణాలు…
మైగ్రైన్ (Migraine) సమస్య ఉన్న వారు తల లో సాగ భాగం లేదా ఒక పక్క తీవ్రమైన నొప్పి తో భాధపడుతుంటారు. ఈ నొప్పి కొన్ని గంటలు కానీ కొన్ని రోజులు కూడా ఉంటుందట. అంత తీవ్రమైన తల నొప్పి వాళ్ళ కొంతమందిలో వాంతులు, వికారం వంటి సమస్యలు కూడా వస్తాయట.మైగ్రైన్ తల నొప్పి ఎంత భయంకరమైనది అంటే కనీసం రోజువారీ పనులు కూడా చేస్కులేనంతగా బాధిస్తుందట. మైగ్రైన్ ఉన్న చీకటి ప్రదేశం నుంచి వెలుతురు లో కి ఉన్నట్టుండి వెళ్లిన నొప్పి మొదలైపోతుందట.అలాగే వీరు ఎక్కువ శబ్దాన్నీ కూడా భరించలేరట.మైగ్రైన్ అంటే కేవలం తల నొప్పి ఒకటే కాదు ఈ తల నొప్పి వచ్సినప్పుడు ఎటు వైపు తల నొప్పి ఉందొ ఆ పక్క కన్ను నొప్పి ఆ కంటి లో నుంచి నీరు కారడం వంటి సమస్యలు కూడా వస్తాయట.ఒకరకంగా చెప్పాలంటే ఈ మైగ్రైన్ సమస్య ఉన్న వారు నరకం అనుభవించినట్టే ఉంటుందని భాదితులు చెబుతున్నారు.
మైగ్రైన్ (Migraine)సమస్య రావడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చట అంటే మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత, నిద్రలేమి,వాతావరణ లో మార్పులు ఇలా ఎన్నో కారణాలు. మైగ్రైన్ ని నయం చేసే వైద్యం ఏమైనా ఉందా అంటే నొప్పి తగ్గించడానికి టాబ్లెట్ లు ఉన్నాయట కానీ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ ఉపయోగించడం మంచిది కాహ్దని డాక్టర్లు చెబుతున్నారు. కానీ మూడు మోగా ఆసనాలు తో మైగ్రేన్ తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చుట .ప్రతి రోజు ఈ యోగాసనాలు వల్ల శరీరంలో రక్త ప్రసరణను వేగవంతం చేసి కండరాలను రిలాక్స్ చేయడం వలన మైగ్రేన్ లక్షణాలు క్రమంగా తగ్గడం జరుగుతుందట. మైగ్రైన్ ను తగ్గించే యోగాసనాలు గురించి తెలుసుకుందాం..
మైగ్రైన్ ను తగ్గించే యోగాసనాలు..
1. అధోముఖ స్వానాసన..
ఈ ఆసనాన్ని downward facing dog pose అని అంటారట.
2. మార్జాలాసనం..
మార్జాలం అంటే పిల్లి.ఈ ఆసనం పిల్లి ఆకృతి ని పోలి ఉంటుంది అందుకే ఈ ఆసనానికి cat strech అని పేరు. ఈ ఆసనానికి ముందు మోకాళ్ల మీద కూర్చోని చేతులను ముందుకు చాచి వెన్నెముకను సమాంతరంగా ఉంచి శ్వాసను వదులుతున్నప్పుడు ఛాతీని, కడుపును లోపలికి తీసుకుంటూ వెన్నెముకను వంచాలి.ఆ తరువాత మళ్ళీ సాధారణ శ్వాస తీసుకుంటూ నార్మల్ పొజీషన్ కు రావాలి. అదే విధానాన్ని రిపీట్ చేయాలి.
3. పద్మాసనం..
ఈ యోగాసన్నాని మనం చిన్నపాటి నుంచి చూస్తూనే ఉన్నాము కాకపోతే ఈ మధ్య ఉద్యోగ రీత్యా బయట ఉన్న భోజనం చేయడానికి కుర్చీలను వాడుతున్నాము. మునుపటి రోజుల్లో అందరూ కలిసి కింద కూర్చొని భోజనం చేసేవారు.ఒక్క భోజనం చేసేటప్పుడు మాత్రమే కాదు ఏ పని అయినా కుర్చీలు సోఫా ల మీద కూర్చుని చేస్తున్నారే తప్ప కింద కూర్చోవడం మానేశారు. కానీ ఈ పదమాసమే ఇప్పుడు మైగ్రైన్ కి మంచి ఔషధం గ పనిచేస్తుంది అని యోగ నిపుణులు అంటున్నారు.మాములుగా మనం పద్మాసనం లో ఎలా కూర్చుంటామో ఆలా కూర్చొని కుడిపాదాన్ని తీసి ఎడమ తొడ మీద ఉంచి తరువాత అలాగే ఎడమ పాదాన్ని తీసి కుడి తొడ మీద ఉంచాలి.ఇప్పుడు కొంత సమయం సాధారణంగా శ్వాస తీస్కుని మల్లి ఈ పొజిషన్ ను మార్చాలి అంటే ఆ కాలు ఇటు ఈ కాలు అటు మార్చి మళ్లీ వేరుగా చేయాలి.
ఈ మూడు యోగాసనాలు క్రమం తప్పకుండ రోజు చేస్తుంటే మహిళ్ళల్లో వచ్చే ఈ మైగ్రైనే సమస్య ని వివరించవచ్చని యోగ నిపుణులు చెబుతున్నారు.