ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ థీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఉదయం 9.45 గంటలకు ముఖ్యమంత్రి జగన్ విజయవాడకు చేరుకుంటారు. దీంతో పోలీసులు ఆయన పర్యటించే ప్రాంతాల్లో బందోబస్తును ఏర్పాటు చేశారు.
చీఫ్ జస్టిస్గా…
ఉదయం పది గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చీఫ్ జస్టిస్ గా థీరజ్ సింగ్ ఠాకూర్ చేత గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ తో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు, హైకోర్టు న్యాయమూర్తులు కూడా హాజరు కానున్నారు. అనంతరం హైకోర్టుకు చేరుకుని తేనేటి విందులో ఆయన పాల్గొననున్నారు.