YS
తెలంగాణలో వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల ఎట్టకేలకు ఒక నిర్ణయానికొచ్చారు. పాలేరు నుంచే బరిలోకి దిగాలని చివరకు డిసైడ్ అయ్యారు. షర్మిల మిర్యాలగూడకు మారతారని, పాలేరు స్థానం వైఎస్ విజయమ్మకు ఇస్తారని ఊహాగానాలు రేగాయి. ఈ ఊహాగానాలకు ఒక కారణం ఉంది. పాలేరు నుంచి కాంగ్రెస్ తరపున కుటుంబం తరపు సన్నిహితుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి బరిలో నిలిచారు. అందువల్ల షర్మిల తన స్థానం మార్చుకుంటారేమో అని వార్తలు వచ్చాయి. కానీ తర్జన, భర్జనల మీద చివరకు పాలేరు నుంచే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. నిజానికి కేసీఆర్ ను గట్టిగా ఢీకొనే ఉద్దేశంతోనే ఆమె తెలంగాణలో కాలు పెట్టారు. ఇప్పటి వరకూ ఎవరూ తిట్టనంత ధైర్యంగా కేసీఆర్, కేటీఆర్ లను ఢీ కొన్నారు.. పార్టీ పెట్టిన కొత్తల్లో చాలా ఉత్సాహంగా తిరిగిన షర్మిల ఆ తర్వాత డల్ అయిపోయారు. పార్టీలో చేరికలు లేకపోవడం, పార్టీని నడపడం కష్టంగా మారడంతో తటపటాయిస్తున్న సమయంలో ఆమెకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. అయితే షర్మిల చేరికను తెలంగాణ కాంగ్రెస్ నేతలు పడనివ్వలేదు. అటు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆ తర్వాత పెద్దగా స్పందించకపోవడంతో షర్మిల పార్టీ విలీనాన్ని మానుకుని బరిలోకి దిగాలనే నిర్ణయించుకున్నారు.
4న నామినేషన్ ,రేపటినుంచి ప్రచారం YS
ఈ ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ 1నుంచి పాలేరులో ప్రచారం ప్రారంభించి నవంబర్ 4న నామినేషన్ వేయాలని డిసైడ్ అయ్యారు. పాలేరులో కాంగ్రెస్ నుంచి పొంగులేటి, బీఆర్ ఎస్ నుంచి ఉపేందర్ రెడ్డి బరిలో నిలవడంతో ట్రయాంగిల్ ఫైట్ జరుగుతోంది. వాస్తవానికి అది కాంగ్రెస్ కంచుకోట.. ఇక్కడ కాంగ్రెస్ నుంచి గెలిచిన ఉపేందర్ రెడ్డి ఆ తర్వాత బీఆర్ ఎస్ లో చేరిపోయారు. సో ఈసారి పోటీలో పొంగులేటి గెలుస్తారా? లేక వైఎస్ చరిష్మాతో షర్మిల గెలుస్తారా? లేక బీఆర్ఎస్ గెలుస్తుందా అన్నది సస్పెన్స్ గా మారింది. పాలేరు నుంచి షర్మిల గెలిస్తే అసెంబ్లీలోకి అడుగు పెడతారు. కానీ టఫ్ ఫైట్ కావడంతో ఓట్లు చీలిపోతాయి. ఆ చీలిపోయిన ఓట్లు బీఆర్ ఎస్ కు లాభం కలిగి కారు పార్టీ గెలుస్తుందని కొందరి ఊహాగానాలు.
ఓట్లు చీలరాదనే ప్రయత్నించా: షర్మిల
షర్మిల కాంగ్రెస్ తో మంతనాలు జరిపి కొంత పొరపాటు చేశారు. దాంతో తనపై ఉన్న క్రేజ్ ను, చరిష్మాను కొంత తనకు తానే తగ్గించేసుకున్నారు. అది జరగకపోయి ఉంటే పోటీ పొంగులేటి, షర్మిల మధ్య ఉన్నా వైఎస్ చరిష్మా కలసి వచ్చేదనేది ఒక వాదన. అయితే తన ప్రయత్నానికి ఓ వివరణ ఇచ్చారు షర్మిల. కేసీఆర్ లాంటి నియంతను గద్దె దింపాలంటే ఓట్లు చీలిపోకూడదని, ఆ ఉద్దేశంతోనే తాను కాంగ్రెస్ లో పార్టీ విలీనానికి ప్రయత్నించినట్లు తెలిపారు. అయితే కాంగ్రెస్ నుంచి సరైన ప్రపోజల్ రాకపోవడంతో తాను మానుకున్నట్లు 119 స్థానాలకు ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు.
సుదీర్ఘ పాదయాత్ర గెలిపిస్తుందా? YS
జనసేన లాగే షర్మిల పార్టీ కూడా కొత్త పార్టీయే అయినా.. ఆమె ధైర్యంగా కదన రంగంలోకి దిగుతున్నారు.. అనుభవం లేదనో, సమయం సరిపోడం లేదనో సాకు చెప్పకుండా తన పార్టీ అభ్యర్ధులను బరిలోకి దించుతున్నారు. గెలుపు , ఓటమి మాట తర్వాత. ముందు కలేజా ఉన్న మనిషినని నిరూపించుకున్నారు వైఎస్ తనయ. తెలంగాణపై ఏ ఇతర రాజకీయ పార్టీ అధ్యక్షునికీ తీసిపోని రీతిలో ఆమె సమస్యలపై అధ్యయనం చేశారు. తెలంగాణ రాష్ట్రం అంతా పాదయాత్ర చేశారు. ఈ అంశాలన్నీ ఆమెకు ప్లస్ పాయింట్లే అయినా.. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో నెగ్గుకు రావడం కష్టమేనని పిస్తోంది. కారణం బీజేపి, బీఆర్ ఎస్, కాంగ్రెస్ మధ్య ట్రయాంగులర్ ఫైట్ గా మారిపోయిన ఈ ఎన్నికల్లో మరో పార్టీ ఏదైనా గట్టెక్కడం కష్టమే. అయినా షర్మిల గెలిచి చట్ట సభల్లో అడుగు పెట్టి ఓ మహిళా రాజకీయ నాయకురాలిగా, వైఎస్ తనయగా తన సత్తా చాటుదారని ఆశిద్దాం. YS